నేరాలకు, ఘోరాలకు నిలయంగా నెల్లూరు: చెన్నారెడ్డి మనుక్రాంత్

నెల్లూరు: ప్రశాంతతకు మారుపేరుగా నిలిచిన నెల్లూరు నగరాన్ని ప్రస్తుతం నేరాలకు ఘోరాలకు కేంద్రంగా మారిపోయిందని జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనక్రాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ లో ఉన్న జనసేన జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్ లో చిన్నపిల్లల మీద ఇన్ని లైంగిక దాడులు జరుగుతున్నాయని తల్లీతండ్రులు చెప్తుంటే ఈ వైసీపీ ప్రజా ప్రతినిధులు కేవలం ప్రెస్ మీట్లకే పరిమితమై చేతులు దులుపుకుంటున్నారన్నారు. ఈ అరాచకాలు చేసి కూడా స్కూల్ యాజమాన్యం కి తప్పించుకోగలం అనే ధైర్యంతో కొంతమంది ఆగడాలు పెచ్చు మీరుతున్నాయన్నారు. స్కూల్ కి పిల్లలను పంపించాలంటే భయపడే పరిస్థితి వచ్చిందంటే ప్రస్తుతం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్దమవుతుందన్నారు. జనసేన పార్టీ నెల్లూరు లో జరిగిన సంఘటనలను వ్యతిరేకిస్తుందని గతంలో కూడా సుగాలి ప్రీతీ విషయంలో అండగా నిలబడిందన్నారు. అదే విదంగా ఒవెల్ స్కూల్ బాధితులని కూడా పవన్ కళ్యాణ్ దగ్గరకి తీసుకునివెళ్లి న్యాయం జరిగేలా చూస్తామన్నారు.