జనసేన జండాదిమ్మెను ద్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

కుప్పం నియోజకవర్గం: 2022 సంవత్సరంలో రాష్ట్ర మరియు జిల్లా జనసేన నాయకుల ఆధ్వర్యంలో కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం వీర్నమలతాండలో ఆవిష్కరించిన జండాదిమ్మెను గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం జరిగింది. బుధవారం చిత్తూరు జిల్లా కార్యదర్శి రామమూర్తి ఆధ్వర్యంలో స్థల పరిశీలన చేసిన తర్వాత నాయకులు మాట్లాడుతూ ఇలాంటి హేయమైన చర్యలు మానుకోవాలని ముక్తకంఠంతో ఖండించడం జరిగింది. అలాగే నాయకులు మాట్లాడుతూ ఎక్కడైతే మీరు ధ్వంసం చేసారో అదే స్థలంలో జండా ఆవిష్కరణ జరగుతుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు హరీష్, రాష్ట్ర మత్స్యకార కార్యవర్గ సభ్యులు వామనమూర్తి, జిల్లా కార్యవర్గ సభ్యులు వేణు, నవీన్, రఘుపతి, మండల కార్యవర్గ సభ్యులు బాస్కర్, నవీన్, పవన్, నాయకులు మునెప్ప, తంజిల్, రమేశ్ నాయక్, అరవింద్ మరియు గ్రామ కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.