మానవత్వాన్ని చాటుకున్న రాజంపేట జనసేన నేతలు

  • నిరుపేద వృద్ధునికి చేయూత

రాజంపేట: మాటలు రాని నిరుపేద వృద్ధునికి రెండు నెలలకు సరిపడా అమూల్ పాల ప్యాకెట్లను అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. రాజంపేట మండల పరిధిలోని శేషన్నగారి పల్లె గ్రామానికి చెందిన ఎద్దుల పల్లె వెంకటసుబ్బయ్య అనే వృద్ధుడు నోటి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండేవాడు. ఆరు లక్షల రూపాయలు ఖర్చు చేసినా వ్యాధి నయం కాకపోవడంతో గత మూడు సంవత్సరాల క్రితం క్యాన్సర్ వ్యాధి అధికమవడంతో వైద్యులు వెంకటసుబ్బయ్య నాలుకను తొలగించారు. అప్పటినుండి నేటి వరకు ఆహారం లేకుండానే పాలతోనే జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న రాజంపేట జనసేన నేతలు పండగ రోజున తన వంతు సహాయం అందించాలనే ఉద్దేశంతో బుధవారం రెండు నెలలకు పాలకు సరిపడా డబ్బులను అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా రాజంపేట జనసేన నేతలు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించి నిరుపేద వెంకటసుబ్బయ్యను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కరణం శ్రీధర్, తాళ్లపాక శంకరయ్య, వంశీ, చిన్న మల్లెంనరసింహులు పాల్గొన్నారు.