ఘనంగా బొలిశెట్టి సత్యనారాయణ పుట్టినరోజు వేడుకలు

విజయనగరం: పర్యావరణ ప్రధాత, సీనియర్ రాజకీయ నాయకులు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బొలిశెట్టి సత్యనారాయణ పుట్టినరోజు వేడుకలను బుదవారం ఉదయం 42వ డివిజన్, సాయి బాబా కాలనీలో నవజీవన్ అనాధ ఆశ్రమంలో నిర్వహించారు. జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు డొల రాజేంద్రప్రసాద్, త్యాడ రామకృష్ణారావు(బాలు) వృద్దులు, పిల్లల మధ్య కేక్ ను కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం పిల్లలకు, వృద్దులకు అల్పాహారాన్ని అందించారు.