బ్రహ్మసముద్రం మండల కేంద్రంలో ఘనంగా జనసేన జెండా ఆవిష్కరణ

కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం మండల కేంద్రంలో “జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం” మరియు “జనసేన పార్టీ బహిరంగ సభ” బ్రహ్మసముద్రం మండలం జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మరియు మీడియా కో-ఆర్డినేటర్ రాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, తర్వాత జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేసి, ముఖ్య అతిథులు జనసేన పార్టీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ జయరామిరెడ్డి, జనసేన పార్టీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు మురళీకృష్ణ, జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ మరియు జనసేన-టిడిపి సంప్రదింపుల సమన్వయ బాద్యులు బాల్యం రాజేష్, కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వర్యులు ఉమామహేశ్వరనాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో 5 మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు, కళ్యాణదుర్గం పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు, కళ్యాణదుర్గం జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కళ్యాణదుర్గం జనసేన పార్టీ వీర మహిళలు షేక్ తార, మమత మరియు 5 మండలాల నుండి వచ్చిన జనసేన కార్యకర్తలు, నాయకులు, వీరమహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు.