చలివింద్రి గ్రామంలో ఘనంగా జనసేన జెండా ఆవిష్కరణ

మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గంకి చెందిన వీరఘట్టం మండలం, చలివింద్రి గ్రామంలో బుధవారం జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ ఘనంగా జరిగింది. పాలకొండ నియోజకవర్గ నాయుకులు, జనసైనికులు మరియు జనసేన పార్టీ సమన్వయ కర్త నిమ్మల నిబ్రమ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన చేతులు మీదగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గ జనసేన నాయుకులు, జనసైనికులు, చలివింద్రి గ్రామ టీడీపీ పార్టీ జనసేన పార్టీ నాయుకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నిమ్మల నిబ్రమ్ మాట్లాడుతూ 2024లో జరగబోయే ఎలక్షన్స్ లో జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం స్థాపించడం కాయం పాలకొండ నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి గెలుపు తథ్యం అని అన్నారు. అలానే చలివింద్రి గ్రామంలో జనసేన యూత్ టీమ్ ను చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉంది ఇక్కడ జనసైనికులు గ్రామ అభివృద్ధి కోసం గ్రామానికి మంచి పనులు చెయ్యడం కోసం చాలా పరితపించే వ్యక్తులు, ఈ మీటింగ్ ని ఇంతటి ఘనంగా నిర్వహించిన చలివింద్రి జనసేన నాయుకులు టీమ్ కి వీరమహిళలుకు ఈ మీటింగ్ కి వచ్చినటువంటి నియోజకవర్గ నాలుగు మండల జనసేన నాయుకులు అందరికీ “చలివేంద్రి జనసైనికులు” తరుపున పేరు పేరున నమస్కారంలు తెలియజేశారు.