సరికొండపాలెం తండా గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ

వినుకొండ నియోజకవర్గం: బొల్లాపల్లి మండలం, సరికొండపాలెం తండా గ్రామంలో జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను రాయల్ ఆధ్వర్యంలో సరికొండపాలెం తండాలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ మరియు వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణ చేసిన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మరియు జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేయటంతో పాటు గ్రామ ప్రజల త్రాగునీటి అవసరాల కోసం వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసినందుకు నాగశ్రీనుని ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా కలిసికట్టుగా నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని కోరారు. ఒక్క అవకాశం ఇవ్వండి అని జగన్ మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలను నమ్మించి, అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేశారు. వచ్చే ఎన్నికలలో జనసేన-తెలుగుదేశం పార్టీలు బారి మెజారిటీతో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అని మాట్లాడారు.