గణేష్ చతుర్థి ఉత్సవాలలో పాల్గొన్న ఉప్పు వెంకటరత్తయ్య

గుంటూరు: ప్రత్తిపాడు మండలంలోని కోయవారిపాలెం గ్రామంలో వినాయకచవితి ఉత్సవాలు గత వారం రోజులుగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్థానిక జనసేన నాయకులు యలవర్తి నాగరాజు ఆహ్వానం మేరకు ఆదివారం జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య, గుంటూరు పట్టణ ఉపాధ్యక్షులు చింతా రేణుకా రాజు, లాలుపురం జనసేన పార్టీ నాయకులు కాటూరి శ్రీనివాసరావు (మాష్టారు), సూదాబత్తుల శివయ్య, గుంటూరు రూరల్ మండల కార్యదర్శి, తోట వెంకటేష్ కురేటి శంకర్ అక్కి రవి, వాసుదేవరావు, రాము తదితరులు స్వామి వారికి పూజ కార్యక్రమం నిర్వహించినారు. అనంతరం గ్రామ ప్రజలకు భారీ అన్నదానం ఏర్పాటు చేసినారు. ఈ అన్నదానం కార్యక్రమములో జనసైనికులు మరియు గ్రామ ప్రజలు యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.