వారాహి విజయ యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన వబ్బిన శ్రీకాంత్

పెందుర్తి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈనెల ఆగస్టు 10వ తారీఖు నుంచి 19 వరకు విశాఖపట్నంలో ఏర్పాటుచేసిన వారాహి విజయ యాత్ర కార్యక్రమాన్ని జయప్రదం జరిగేలాగా గ్రామాల్లోకి వారాహి విజయ యాత్ర కార్యక్రమాన్ని 88వ వార్డ్ గాజువాక నియోజకవర్గం, యాదవ జగ్గరాజుపేట గ్రామంలో నాయకులు వబ్బిన జనార్దన్ శ్రీకాంత్ ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క వారాహి యాత్రను దిగ్విజయంగా జరగాలని, ఇప్పటివరకు విశాఖపట్నంలో జనసేన పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక మైలరాయిగా మిగిలాయని అదే కోవలోకి రేపు జరగబోయే వారాహి యాత్ర కూడా చేరాలని మనందరం ఈ యొక్క యాత్ర యొక్క విశిష్టతను జనాల్లోకి తీసుకొని వెళ్లాలని, ఆగస్టు 10వ తారీఖున అధ్యక్షులు వారికి అఖండ స్వాగతంతో ఎయిర్ పోర్ట్ నుండి జగదాంబ జంక్షన్ వారాహి సభ వరకు మనం తీసుకుని వెళ్లి ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం జరిగేలాగా కార్యక్రమంలో గ్రామ ప్రజలను, వీర మహిళలను, యువత పాల్గొనే లాగా భవిష్యత్తు కార్యచరణ జరగాలని జనసైనికులు కోరడం జరిగింది. స్థానిక నాయకులు చిన్నారావు మాట్లాడుతూ ఎప్పటిలాగే 88వ వార్డు నుండి అత్యధిక జనాభాతో జనసేన పార్టీ కార్యక్రమాలు విజయవంతం జరిగేలాగా మనందరం కృషి చేయాలని తప్పకుండా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ నాయకత్వం జనసేన పార్టీ ప్రభుత్వం ఎంతో అవసరమని వివరించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో లోకేష్, ప్రసాద్, కృష్ణ, పెంటారావు, ప్రవీణ్, ఆనంద్, చలం, కిషోర్, అశోక్, చలం, హేమంత్, నవీన్, నాగేష్, ఉపేంద్ర బాలు, లక్ష్యణరావు, సోమేష్,శివ, ఉదయ్, భార్గవ్ మరియు జనసైనికులు ప్రజలు పాల్గొన్నారు.