శ్రీ మానస పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు

రాజోలు నియోజకవర్గం: పడమటి పాలెం గ్రామానికి చెందిన జనసేన నాయకులు అడబాల దొరబాబు, నాగదుర్గ దంపతుల కుమార్తె అడబాల లారణ్య శ్రీ మానస పుట్టినరోజు సందర్భంగా బుధవారం రాజోలు మానసిక వికలాంగుల అనాధ ఆశ్రమంలో అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. మరియు లిటిల్ హార్ట్స్ సేవాసమితికి 1116 రూపాయలు, గొంది అంతర్వేది జనసేన వాటర్ ట్యాంక్ కి 2000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నామన నాగభూషణం, పంచదార చినబాబు పాల్గోన్నారు.