టిడ్కో ఇళ్లు, జగనన్న కాలనిల భాదితుల తరుపున వీరఘట్టం జనసేన గళం..

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు #JaganannaMosam కార్యక్రమంలో మొదటి రోజులో భాగంగా వీరఘట్టం మండల కేంద్రానికి సంబంధించిన జగనన్న కాలనీలను సందర్శించిన జనసేన పార్టీ నాయకులు మత్స.పుండరీకం, జనసేన జాని, వావిలపల్లి నాగభూషన్ మాట్లాడుతూ ప్రభుత్వ టిడ్కో ఇల్లు పూర్తయి మూడున్నర సంవత్సరాలు పూర్తయినా ఈ ప్రభుత్వం లబ్ధిదారులకు వాటిని అప్పగించలేదన్నారు. నివాసాలకు ఏ మాత్రం ఇళ్ల స్థలాల నుంచి జగనన్న కాలనీల అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాన్ని క్షేత్రస్థాయిలో ఎండగట్టేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు అందులో మొదటి రోజు వీరఘట్టం మండల కేంద్ర పరిధిలో గృహ నిర్మాణ పథకాలు, జగనన్న కాలనీలో సముదాయాలను సందర్శించి అవి ఏయే దశల్లో ఉన్నాయో పరిశీలించారు. ఆయా కాలనీలో స్థలాల్లో విస్తృతంగా పర్యటించి లబ్ధిదారులకు ఇంతవరకు ఒక్క ఇల్లు నిర్మాచకపోడం ఏమిటి అని ప్రశ్నించారు?. జగనన్న కాలనీలో తిష్టవేసిన ప్రతి సమస్య తెలుసుకుని, ప్రజల పక్షాన నిలబడి అవి పరిష్కారం అయ్యేవరకు ప్రభుత్వంపై జనసేన పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు.