వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు

నెల్లూరు రూరల్: జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ సూచనలతో, నెల్లూరు రూరల్ జనసేన 33 వ డివిజన్ కమిటీ ఇన్ఞచార్జ్ మనీషా ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధురాలు భారత మహిళా శక్తిని, సాధికారతను చాటిన వీర మహిళ ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో లైంగిక వేధింపులకు గురైన పేద మైనర్ బాలిక విషయంలో బాధితురాలికి జనసేన పార్టీ తరఫున అండగా నిలబడి నిందితున్ని అరెస్టు చేయించిన కమిటీ లీగల్ కమిటీ సభ్యురాలు సుభాషినికి సన్మానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మాట్లాడుతూ.. ఇంతమంది మహిళలు ఈ డివిజన్ నుంచి జనసేన పార్టీకి మద్దతుగా నిలవడం శుభపరిమాణం అని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెబుతుంటారు సాధారణ కుటుంబాల నుంచి మహిళలు బయటకు వచ్చి వారి సమస్యలు సాధికారతకు ప్రయత్నించాలని. దేశం కోసం పోరాడిన ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తితో సమాజంలో జరుగుతున్న రుగ్మతలను రూపు మాపేందుకు ప్రతి మహిళా ఒక కాళికాదేవి కావాలని తెలిపారు. సగటు కుటుంబాల నుంచి మహిళలు వస్తే కుటుంబాలలో జరిగే ఇబ్బందులు తెలిసి పాలనపరంగా మార్పులు వస్తాయి అని తెలిపారు. మహిళలకు అందరికి అండగా మహిళా కమిటీ మరియు లీగల్ టీం ఉందని ఏ సమస్య వచ్చినా మీ తరఫున జనసేన పార్టీ అండగా నిలబడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, కృష్ణ పెన్నా జిల్లాల మహిళా కోఆర్డినేటర్ కోలా విజయలక్ష్మి, జిల్లా కార్యదర్శులు ఆలియా, సావిత్రి, రాధమ్మ, మహిళా నాయకురాళ్లు కృష్ణవేణి, కస్తూరి, సుజాత మరియు మనీషా, జిల్లా కార్యదర్శులు పూసల మల్లేశ్వర రావు, ప్రశాంత్ గౌడ్, స్థానిక జనసేన నాయకులు రాజా శంకర్ మరియు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు.