ఇటీవల మరణించిన జనసైనికుడు బండి రాము కుటుంబాన్ని పరామర్శించిన వేగుళ్ళ లీలాకృష్ణ

రాయవరం, చెల్లూరు గ్రామంలో జనసేన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఇటీవల స్వర్గస్తులైన జనసైనికుడు బండి రాము అకాల మరణానికి చింతిస్తూ మండపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ గారు శ్రద్ధాంజలి ఘటించారు. గురువారం చెల్లూరు వారి స్వగృహం నందు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ పరామర్శలో జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి దాలిపర్తి శ్రీనివాసు, చెల్లూరు ఎంపీటీసీ-1 గొల్లపల్లి అనురాధ, వల్లూరి సత్యప్రసాద్, గొల్లపల్లి వెంకటరమణ, తలాటం వెంకటేష్, దేవు రాజా తదితరులు పాల్గొన్నారు.