అరెస్టయిన కార్మికులను తక్షణమే విడుదల చేసి కంపెనీలో తిరిగి చేర్చుకోవాలని జనసేన డిమాండ్

బొబ్బిలి, మైతాన్ కంపెనీ కార్మికులపై లాఠీ చార్జీ మరియు అక్రమ కేసులను ఖండిస్తూ సి.ఐ.టి.యు మహిళా కార్మికులు చేస్తున్న నిరసన దీక్షకు సంఘీభావం తెలిపిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు అరెస్టయిన కార్మికులను తక్షణమే విడుదల చేసి కంపెనీలో తిరిగి వారి ఉద్యోగాలు వచ్చేలా చర్యలు చేపట్టాలని వైసిపి ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ అధికారులను డిమాండ్ చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో గంగాధర్, సతీష్, శ్రీను, రాజా, సత్య తదితరులందరూ పాల్గొన్నారు.