వెలాసిటీ విజయారంభం
షార్జా వేదికగా బుధవారం ఉమెన్స్ ఐపీఎల్ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ లో సూపర్నోవాస్-వెలాసిటీ జట్లు తలపడగా.. ఉత్కంఠ పోరులో వెలాసిటీ అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో టాస్ గెలిచిన వెలాసిటీ జట్టు బౌలింగ్ ఎంచుకొని సూపర్నోవాస్ బ్యాట్స్మెన్స్ ను బాగానే కట్టడి చేసింది.
ఓపెనర్ చమరి ఆటపట్టు 44 పరుగులతో రాణించడంతో ఇన్నింగ్స్ దారిలో పడింది. ఆ తర్వాత జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్తో ఆకట్టుకున్న మిగితా వారందరు విఫలం కావడంతో సూపర్నోవాస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 126 పరుగులు మాత్రమే చేసింది.
ఆఖరి వరకు పట్టువదలకుండా విజయం కోసం పోరాడిన వెలాసిటీ ఇంకో బంతి మిగిలుండగానే టార్గెట్ను ఛేదించింది. 127 పరుగుల లక్ష్య చేధనతో పోరులోకి దిగిన సుష్మా వర్మ(34), సునె లూస్(37 నాటౌట్) గొప్పగా రాణించారు. వేద కృష్ణమూర్తి(29) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సూపర్నోవాస్ బౌలర్లలో అయభాంగ ఖాకా రెండు వికెట్లు తీయగా రాధా యాదవ్, పూనమ్ యాదవ్, శశికళ తలో వికెట్ పడగొట్టారు.