లక్ష్మీదేవి పల్లి మండలంలో పర్యటించిన వేముల కార్తీక్

కొత్తగూడెం నియోజకవర్గం, లక్ష్మీదేవి పల్లి మండలంలోని రేగళ్ల మైలారం గట్టు, మల్ల కొత్తూరు, గొల్లగూడెం, మర్రిగూడెం, తోగ బంధాలు బాబుజి తండాలలో జనసేన పార్టీ కొత్తగూడెం ఇంచార్జ్ వేముల కార్తీక్ పర్యటించారు. పర్యటనలో భాగంగా జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు జనసేన నాయకులతో మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ సుమారు ఆ గ్రామాల్లో ఎవరికి దళిత బంధు ఇవ్వలేదు అని వారి బాధను వినిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ వీరాభిమాని(పవన్ కళ్యాణ్ బయోగ్రఫీ రైటర్) భాష, జనసైనికులు పాల్గొన్నారు.