వెంకటాచలం చెరువు అక్రమ మట్టి తవ్వకాల్ని అరికట్టాలి!!

సర్వేపల్లి నియోజకవర్గం: వెంకటాచలం చెరువు అక్రమ మట్టి తవ్వకాల్ని అరికట్టాలని జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జిల్లా జనసేన పార్టీ వీరమహిళా కన్వీనర్ కోలా విజయలక్ష్మి, ఉపాధ్యక్షుడు బద్దిపూడి ఆధ్వర్యంలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సహజ వనరులన్నీ పెత్తందారులకు విల్లు రాయిచ్చినట్లుగా ఉంది. జిల్లాలో ఇసుక, గ్రావెల్, మట్టి అక్రమ రవాణా పేట్రేగి పోయింది. నిబంధనలకు నీళ్లు వదిలి అధికారుల నిర్లక్ష్యంతో కోట్ల రూపాయల సహజ సంపద పెత్తందారులు సొంతమవుతుంది. సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం చెరువు లో బంగారం మించి మట్టి వ్యాపారం జరుగుతుంది. బంక కోసం అనుమతులు తెచ్చుకున్న గుత్తేదారులు కొంత జగనన్న కాలనీకి అని చెప్పుకున్నా వారు తవ్విన దానికి తరలిస్తున్న దానికి పొంతనే లేదు. ఏ ప్రాంతానికి సంబంధించిన ఏరియాలో ఆ ఏరియాలో మట్టి ఉండగా వెంకటాచలం చెరువు వద్ద దాదాపుగా కిలోమీటర్ల మేర 10 అడుగులు పైబడి తవ్వి నియోజకవర్గం దాటి అనేక ట్రక్కులు పోతున్నాయి. స్థానిక నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మట్టిని తవ్వి నేలనూ చదును చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారని, లక్షల విలువ చేసే సంపద ఉచితంగా తీసుకొని పోవడం నేరము. ఒక 15 నుంచి20 నిమిషాల అక్కడ వేచి ఉంటే దాదాపుగా 20 నుంచి 30 ట్రక్కులు లోడింగ్ అన్లోడింగ్ జరుగుతూ ఉన్నాయి. అధికారులు కూడా ఈ పెత్తందారుల అడుగులకు మడుగులు అక్రమ రవాణాన్ని చూసి చూడనట్లే పోతున్నారని పిస్తుంది. ప్రభుత్వ అధికారులకు అందరికీ కూడా ఇంపార్టెంట్ నోట్ 2024లో ప్రభుత్వం మారబోతుంది మీరందరూ జవాబు చెప్పవలసి వస్తుంది. రెవెన్యూ సిబ్బంది గాని మైనింగ్ డిపార్ట్మెంట్ గాని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ గతంలో మా నాయకులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చూసి చూడనట్లు ఊరుకోవటం వలన అక్రమ రవాణా పేట్రేకిపోయింది. ఈ తవ్విన తవ్విన గుంతలకు మీరు రేపు రానున్న రోజుల్లో కచ్చితంగా వీటికి లెక్క చెప్పాల్సి వస్తుంది. పేద మధ్య తరగతిలో వారు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వైసిపి నాయకులు వారి కింద పెత్తందారులు మాత్రం అక్రమంగా దోచుకుంటూ లక్షల్లో మునిగిపోతున్నారు. అక్రమ తవ్వకాల వల్ల రేపేదైనా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు నష్టపోయ ప్రజల క్షేమం మరిచి ప్రవర్తిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ప్రజా ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి సహవాస సహజ సంపదలను కాపాడవలసిందిగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, వీరమహిళ కన్వీనర్ కోల విజయలక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షుడు సుధీర్ బద్దిపూడి, కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, హేమచంద్ర యాదవ్, సుమంత్, చిన్నరాజా, ప్రసన్న, కేశవ, ఖలీల్, వర్షన్ తదితరులు పాల్గొన్నారు.