అమలాపురం అల్లర్ల పాపం పూర్తిగా వైసీపీదే: ఎస్ వి బాబు

పెడన, విచ్ఛిన్నకర శక్తులకు రాజ్యాధికారం వస్తే ఎలాంటి విధ్వంసం సృష్టిస్తారొ అమలాపురం అల్లర్లు అందుకు తార్కాణం. అమలాపురం అల్లర్లను జనసేన మీద, ఒక సామాజికవర్గం మీద నెట్టి వేయాలని వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రయత్నించింది. పచ్చని కోనసీమను రావణకాష్టంలా చేసి చలిమంట కాచుకునే ప్రయత్నం చేసింది. కోనసీమ వాసులు ఎంతో విజ్ఞులు, సమన్వయంతో వ్యవహరించారు. ఇప్పుడు అసలు దొంగలు బయట పడ్డారు. వారు మొత్తం వైసీపీ నాయకులు, మంత్రి అనుచరులు. ఇప్పుడు అధికార పార్టీ ఏమి సమాధానం చెబుతుంది. వైసీపీ దాష్టికం దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది. రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైసీపీ పార్టీకి తప్పక బుద్ధి చెబుతారు. జగన్ రెడ్డి కి ఒక ఛాన్స్ ఇచ్చి మోస పోయిన ప్రజలు, అదే చివరి ఛాన్స్ చేయడానికి సిద్ధం అవుతున్నారని పెడన నియోజకవర్గ జనసేన నాయకులు ఎస్ వి బాబు అన్నారు.