వెంకటరమణ గూడెం వైసీపీకి షాక్

తాడేపల్లిగూడెం మండలం, వెంకటరమణ గూడెం వైసీపీ నుంచి జనసేనలోకి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి, జనసేన ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో మంగళవారం చేరారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని తానే వ్యవహరించి నిర్వీర్యం చేశాడని, గ్రామాల్లో కనీసం మౌలిక వసతులు కూడా కల్పించలేని స్థితిలో సర్పంచులు ఉన్నారని దుయ్యబట్టారు. ఇటు కౌలు రైతులను గాని రైతులను గాని పట్టించుకోకుండా రైతుల పట్ల చిన్నచూపు చూశారని ఆరోపించారు. గతంలో ఇదే కూటమి అధికారంలో ఉన్నప్పుడు గ్రామాలు శరవేగంగా అభివృద్ధిలో దూసుకుపోయాయని ప్రజలంతా అదే కోటమని మళ్లీ ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని వైసీపీ నుంచి అన్ని గ్రామాల్లో నుంచి పెద్ద ఎత్తున జనసేనలో రావడం చాలా ఆనందదాయకం అని అన్నారు. జజ్జవరపు సుబ్రహ్మణ్యం బ్రదర్స్, నేలపల్లె నారాయణుడు, నాదెండ్ల శీను బండారి చెన్నయ్య, మానుకొండ శ్రీను తదితరులు నాయకులు కార్యకర్తలు భారీగా జనసేనలోకి చేరారు. తోట గోపి ఆధ్వర్యంలో జజ్జవరపు సుబ్రహ్మణ్యం బ్రదర్స్, నేలపల్లె నారాయణుడు, నాదెండ్ల శీను బండారి చెన్నయ్య, మానుకొండ శ్రీను తదితరులు నాయకులు కార్యకర్తలు భారీగా జనసేనలోకి చేరారు.