కీముడు పల్లి గ్రామంలో పర్యటించిన జాగరపు పవన్ కుమార్

అల్లూరిజిల్లా ఆరకు నియోజకవర్గం పెదబయలు మండల అధ్యక్షులు జాగరపు పవన్ కుమార్ కీముడు పల్లి గ్రామాన్ని సందర్శించి ఆ గ్రామంలో పలు సమస్యలు వాటి వివరాలు గ్రామస్తులను కలిసి తెలుసుకున్నారు. ప్రధానంగా త్రాగునీటి సమస్య అధికంగా ఉందని అలాగే సీసీరోడ్డు, డ్రైనేజీ వ్యవస్థ, పంట కాలువలు వంటి సమస్యలున్నాయని తెలిపారు. ఈ సమస్యలపై సంబంధిత అధికారులకు తెలియజేసి గ్రామస్థాయిలో సమస్యలపై పరిష్కరించేలా పోరాటం చెయ్యడానికి జనసేన పార్టీ ఎప్పుడు ముందుంటుందని పవన్ కుమార్ జాగరపు గ్రామస్తులకు తెలిపారు. ఈ పర్యటనలో మండల అధ్యక్షులు పవన్ కుమార్ జాగరపు జనసైనికులు విష్ణుమూర్తి, రాంబాబు, రమేష్, కళ్యాణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.