వనగపల్లి గ్రామంలో జాగరపు కళ్యాణ్ కుమార్ పర్యటన
అరకు నియోజకవర్గం: వనగపల్లి గ్రామంలో జనసేన పార్టీ యువ నాయకుడు జాగరపు కళ్యాణ్ కుమార్ పర్యటించారు. పర్యటనలో భాగంగా గ్రామస్తులతో మాట్లాడుతూ గ్రామ సమస్య తెలుసుకున్నారు. గ్రామంలో ముఖ్యంగా తాగునీరు, రోడ్డు, డ్రైనేజ్ లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నామని కళ్యాణ్ కు తెలియజేయగా, కచ్చితంగా జనసేన ప్రభుత్వం అధికారంలోనికివస్తే ఈ సమస్యలను పరిష్కరిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ వైసీపీ ప్రభుత్వం పోయేంతవరకు ప్రజలందరికీ ఇదే పరిస్థితి జరుగుతుంది, కావున పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేస్తే ఏ సమస్య కూడా లేకుండా ఉంటుందని గ్రామస్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రాంబాబు, జీవన్, నారి, రఘు పాల్గొన్నారు.