బాధిత కుటుంబానికి కుటుంబానికి అతికారి దినేష్ ఆర్ధిక సాయం

రాజంపేట నియోజకవర్గం: రాజంపేట మండలం, చుండూరు వారి పల్లి జగనన్న కాలనీలో ఒక హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. వడ్డే నారాయణ బేల్దారి పనిచేసుకునే సాధారణ కుటుంబానికి చెందినవారు. జగనన్న కాలనీలో వారికి కేటాయించిన స్థలంలో గృహ నిర్మాణం చేసుకుంటూ భోజనం చేద్దామని నీడ కోసం పక్కన ఉన్న ఈ ప్రభుత్వ కట్టించిన ఇంటి మెట్ల కింద కూర్చొని ఉంటే ఆ మెట్లు ఒక్కసారిగా కుప్పకూలి ఆయన మీద పడి నారాయణ మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ యువ నాయకులు అతికారి దినేష్ వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి 10000 ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారి కుటుంబానికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఓబులేసు, గుగ్గిల నాగార్జున, నీతి వెంకటేష్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *