పనసపొట్టు గ్రామంలో పర్యటించిన జాగరపు పవన్ కుమార్

అరకు నియోజకవర్గం: పెదబయలు మండలం, పనసపొట్టు గ్రామంలో పర్యటించిన జనసేన మండల అధ్యక్షులు జాగరపు పవన్ కుమార్ కి గ్రామస్తులు ఘనస్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మాట్లాడుతూ.. మీ వంటి వ్యక్తి గిరిజన ప్రాంతంలో చాలా అవసరం, అతి చిన్న వయస్సులో రాజకీయాలకి రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రజల సమస్యలను ఎప్పుడూ తెలుసుకుంటూ.. ప్రజల్లోనే ఎల్లప్పుడూ ఉంటూ ప్రజల సమస్య నా సమస్య అంటూ ముందుకు సాగుతున్న వ్యక్తిత్వం చాలా సంతోషంగా ఉందని గ్రామస్తులు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పవన్ కుమార్ మాట్లాడుతూ నాకు ప్రజలు మీద ఉన్న ప్రేమ ఆప్యాయతతోనే నేను రాజకీయాలకి రావడం జరిగింది. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే మీ గ్రామంలో ఏ సమస్య లేకుండా చేస్తామని హామీ ఇస్తున్నానని పవన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు జై కళ్యాణ్, రామన్న, రాజు, నారాయణ పాల్గొనడం జరిగింది.