విజయ్ సాయి రెడ్డి గారు మీ కోతి వేషాలు మానండి!

  • అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి

అనంతపురం: విజయ్ సాయి రెడ్డి గారు మీ కోతి వేషాలు మానండి! ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు గతంలోనే జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయించారు. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ప్రజలలో అలజడి సృష్టించే దాని కోసం గాజు గ్లాస్ గుర్తు గురించి తప్పుడు ఆరోపణలు చేస్తూ లబ్ధి పొందాలని చూస్తే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదు అని నీకు హెచ్చరిస్తున్నామని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి పేర్కొన్నారు. జయరాం రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి లాగా ఇతర పార్టీలనో, గుర్తులునో జనసేన లాక్కోలేదని తెలుసుకో? రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఇతర పార్టీల ఎన్నికల గుర్తు గురించి తప్పుగా మాట్లాడుతూ గందరగోళం సృష్టించడం ఎంతవరకు సమంజసం? మీరేదో పెద్ద అపర మేధావి? అని మీ పార్టీ శ్రేణులు మీ గురించి గొప్పగా చెప్పుకుంటుంటారు, మీరు ఇంత ఉచ్చ స్థితికి దిగజారి ప్రవర్తిస్తారని మేము ఎప్పుడు అనుకోలేదు. గురిగింజ తను నలుపు ఎరగదు అన్నట్టు… మీ పార్టీ సంగతి? మీ సంగతి? ప్రస్తుతం ఎంత నీచనికృష్టమైన స్థితిలో ఉందో మీరు తెలుసుకోండి? జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాస్ గురించి తర్వాత మాట్లాడుదురు?. ఈరోజు సాక్షి పత్రిక మొదటి పేజీలో “బ్రో.. ఇది దొంగ ఓటు!”అంటూ ఒక తప్పుడు కథనాన్ని పత్రికా విలువలు పాటించకుండా ప్రచురించిన సాక్షి యజమాన్యానికి సూటిగా ప్రశ్నిస్తున్నాం? అయ్యా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి ఆఫీస్ కేంద్రంగా దాదాపుగా గత ఏడేళ్ల నుండి పార్టీ కార్యక్రమాలు నడుపుతూ ఉన్నది వాస్తవం కాదా? ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ శాశ్వత చిరునామా మంగళగిరి ఆఫీస్ కాదా? జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి ఆఫీస్ అడ్రస్ పెట్టి ఓటు నమోదు చేసుకుంటే దొంగ ఓటు అవుతుందా? వైసిపి పార్టీ లాగా జనసేన పార్టీ దొంగ ఓట్లు సృష్టించి వచ్చే ఎన్నికల్లో దొంగ ఓటుతో గెలవాలని తప్పుడు ఆలోచనలతో లేదని తెలుసుకోండి? కేవలం వైసిపి పార్టీ శ్రేణులను ఉత్సాహపరచడానికో? లేదంటే ప్రజలలో అలజడి సృష్టించే దానికో? పత్రికా విలువలు పాటించకుండా ఇటువంటి తప్పుడు కథనాలు రాస్తూ ప్రచారం చేస్తే ప్రజలలో మీకున్న కొద్దిపాటి విలువను కూడా కోల్పోవద్దని జయరాం రెడ్డి తెలియజేసారు.