యువశక్తి పోస్టర్ ఆవిష్కరించిన విజయవాడ జనసేన

విజయవాడ, ఈనెల 12వ తారీకున రణస్థలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టబోయే “యువశక్తి బహిరంగ సభ” సందర్భంగా జనసేన పార్టీ 7వ డివిజన్ నాయకులు దోమకొండ అశోక్ ఆధ్వర్యంలో, 7వ డివిజన్ లో పెద్ద ఎత్తున యువశక్తి బహిరంగ సభ గురించి ప్రజలకు, యువతకు అవగాహన కల్పించే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సామాన్య ప్రజలు, యువత, 7వ డివిజన్ కమిటీ సభ్యులు, వీర మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.