బుడ్డయ్య దొడ్డి గ్రామంలో జనసైనికులతో గ్రామస్థాయి సమావేశం

అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గం, సెట్టూరు మండలం పెరుగుపాలెం పంచాయితీ బుడ్డయ్య దొడ్డి గ్రామంలో జనసైనికులతో కలిసి గ్రామస్థాయి నుండి పార్టీ ఎలా బలోపేతం చేయాలో చర్చించడం జరిగింది. రమేష్, అశోక్, చిత్ర, లింగ నగేష్, శ్రీకాంత్, రఘు, రమేష్, రాధాకృష్ణ, నరేంద్ర తిప్పనపల్లి నుండి మండల అధ్యక్షుడు వీరన్న, వీరేష్, బండమీద పల్లి లక్ష్మీనారాయణ హాజరు కావడం జరిగింది.