కదిరి నియోజకవర్గంలో వృద్ధులకు జనసేన పార్టీ తరఫున పెన్షన్

కదిరి నియోజకవర్గం బాలసముద్రం జనసేన పార్టీ ఎంపీటీసీ అమర్ కార్తికేయ స్ఫూర్తితో కళ్యాణదుర్గం పట్టణం అంబేద్కర్ కాలనీలో నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులకు 310 జనసేన పార్టీ తరఫున పెన్షన్ రూపంలో ఇవ్వడం జరిగింది. ప్రతి నెలా వారికి 310 రూపాయలు పెన్షన్ అందిస్తానని భరోసా ఇచ్చాను. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శ్రీ లక్ష్మీ నరసయ్య, సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్ కళ్యాణదుర్గం మండల కన్వీనర్ షేక్ మొహిద్దీన్ కళ్యాణదుర్గం జనసేన నాయకులు జాకీర్ సాయి పాల్గొన్నారు.