జనసేన, తెలుగుదేశం పార్టీల గ్రామస్థాయి సమావేశాలు

రాజోలు నియోజకవర్గం: గ్రామ గ్రామాన
జనసేన- తెలుగుదేశం పార్టీల గ్రామస్థాయి సమావేశాల్లో భాగంగా మంగళవారం మల్కిపురం మండలం రామరాజులంక గ్రామంలో మండల అధ్యక్షులు మల్లెపూడి సత్తిబాబు సమక్షంలో గ్రామశాఖ అధ్యక్షులు ముద్దాల శ్రీను అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయ కర్త గుండుబోగుల పెద కాపు, రాజోలు నియోజకవర్గ జనసేన తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు గొల్లపల్లి సూర్యారావు, జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, తెలుగుదేశం-జనసేన పార్టీల రాష్ట్ర కార్యదర్శులు, జిల్లా కార్యదర్శులు, మండల అధ్యక్షులు, గ్రామశాఖ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.