యర్రబాలెంలో పల్లె పల్లెకు చిల్లపల్లి

మంగళగిరి, జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు తలపెట్టిన పల్లె పల్లె కు చిల్లపల్లి కార్యక్రమం దిగ్విజయంగా సాగుతుందని, రూరల్ ప్రాంతంలో ప్రజలు చిల్లపల్లికి నీరజనాలు పడుతున్నారని జనసేన మంగళగిరి మండల ఉపాధ్యక్షులు బత్తినేని అంజయ్య అన్నారు. యర్రబాలెంలో జరిగిన సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న అయన మాట్లాడుతూ ఆదివారం పల్లె పల్లె కు చిల్లపల్లి కార్యక్రమం యర్రబాలెంలో జరుగుతుందని, కావున జనసేన పార్టీ కార్యకర్తలు, వీరమహిళలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మండల సోషల్ మీడియా కో ఆర్డినేటర్ లేళ్ళ సాయి, సుందరయ్య, పరశురాం, బి పూర్ణ, దిలీప్, ఆళ్ల రమేష్, రాజీవ్ నాగేంద్ర, పావని తదితరులు పాల్గొన్నారు.