దసరా ఉత్సవాలలో పాల్గొన్న జనసేన నాయకులు

కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గం, కొండపల్లి మున్సిపాలిటీ, మైలవరం మండలం చంద్రాగూడెం, వెల్వడం, గ్రామాల్లో దుర్గమ్మతల్లి అమ్మవారి ఊరేగింపు ఉత్సాహలు సందర్భంగా ఆయా గ్రామాలు గుడి కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు జనసేనపార్టీ జిల్లా నాయకులు మండల కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరియు రెడ్డిగూడెం మండలం ఓబుళాపురంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ పండగ సందర్భంగా జనసేనపార్టీ నాయకులు సుందర రామిరెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ పూలఅలంకరణ చేసిన వారికి మొదటి బహుమతి, రెండవ బహుమతి మూడు సెంటర్లలో బతుకమ్మ పండుగ చేసుకుంటున్న మహిళలకు ఖరీదైన చీరలు ఇవ్వడం జరిగింది. కృష్ణవాటర్ ట్యాంక్ బజార్లో రాయల సంధ్య మొదటి బహుమతి, రెండవ బహుమతి ముత్యాల అనూషకి, గౌడా బాజార్లో తన్నీరు వేముల మొదటి బహుమతి, పరికాల దీపు రెండో బహుమతి, రాములవారి గుడి సెంటర్లో చుట్టూ కుదుల నిత్యశ్రీకి మొదటి బహుమతి, కన్నావల్లి సుజాతకి రెండో బహుమతి ఇవ్వడం జరిగింది. అనంతరం బతుకమ్మ సంబరాల్లో జనసేనపార్టీ నాయకులు ఆ గ్రామ మహిళలతో కలిసి ఆడారు పాడారు, ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేనపార్టీ ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి చింతల లక్ష్మికుమారి, ప్రోగ్రాం కమిటీ సభ్యులు సతీష్, రెడ్డిగూడెం, మైలవరం మండల నాయకులు కాంతారావు, పడిగల ఉదయ్, శీలం కిట్టు, బాలరాజు, భాగ్యరాజు, తోట క్రాంతి, నాగరాజు, ఈశ్వర్, గోపాలరావు కిరణ్, అవినాష్, వీరమహిళలు సుజాత మరియు భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.