యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: పార్వతీ నాయుడు

గుంటూరు: శ్రీకాకుళం జిల్లా, రణస్థలంలో‌ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా జరిగే యువశక్తి కార్యక్రమానికి పెద్ద ఎత్తున వీరమహిళలు పాల్గొనాలని పార్వతీ నాయుడు పిలుపు నిచ్చారు.. గుంటూరు జిల్లా కు చెందిన వీరమహిళలతో పట్టణంలో సమావేశం ఏర్పటు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తాను వచ్చిన వెంటనే ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్‌ ప్రకటిస్తానని జగన్ చెప్పినా ఇప్పటి వరకు ఆచరణకు నోచుకో లేదని పార్వతీ నాయడు తెలిపారు. ఉద్యోగాలు లేక యవతరం నిరాశా నిస్పృహలులో‌ కొట్టుమిట్టాడుతొందని వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.. తీవ్ర నిస్పృహతో యునత మాదకద్రవ్యాలకు అలవాటు పడుతోందని తెలిపారు.. యువత పాజిటీవ్ దృక్పథంతో వివేకానంద స్పూర్తితో‌ కార్యోన్ముఖులు‌కావాలని కోరారు.‌ జనసేనాని పవన్ కళ్యాణ్ ఆద్వర్యంలో జరిగే యువశక్తి కార్యక్రమానికి యువ జనసైనికులతో పాటు, అన్ని వర్గాలకు చెందిన యువతీ యువకులు పాల్గొని సూచనలు, సలహాలు ఇవ్వాలని మహిళా వింగ్ కోఆర్డినేటర్ పార్వతి నాయడు కోరారు. ఈ కార్యక్రమంలో మల్లికా, అనురాధ, కార్పొరేటర్ పద్మావతి, కార్పొరేటర్ లక్ష్మీ, విజయలక్ష్మి, కోమలి మరియు జనసేన పార్టీ వీరమహిళలు పాల్గొన్నారు.