వైసీపీనివీడి జనసేన తీర్థం పుచ్చుకున్న గుడపువలస గ్రామస్థులు

నెల్లిమర్ల నియోజకవర్గం: భోగాపురం మండలం, గుడపువలస గ్రామానికి చెందిన సుమారు 70 కుటుంబాలు ప్రస్తుత వైసిపి ప్రభుత్వం చేస్తున్న అవినీతి అన్యాయానికి, విసుగెత్తిపోయి శ్రీమతి లోకం మాధవి ఆధ్వర్యంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గూటపవలస గ్రామ వాసులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తమకి అన్యాయం చేసింది అని, విమానాశ్రయానికి భూమి ఇచ్చిన తమకు కనీసం ఉపాధి అవకాశాలు కానీ మౌలిక సదుపాయాలు గాని ఇప్పటివరకు కల్పించలేదని, ప్రభుత్వం నుండి వచ్చే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో కూడా స్థానిక నాయకత్వం అవకతవకలకి పాల్పడిన విషయం నియోజకవర్గం అంతటా తెలుసు అని, ఈ అన్యాయాలని సహించలేక తాము జనసేన పార్టీలోకి చేరామని తెలియజేశారు. అలానే భోగాపురం భూనిర్వాసితులకి ఆనాడు అండగా నిలిచి పోరాటం చేసిన లోకం మాధవి గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరడం ఎంతో ఆనందపడాల్సిన విషయమని తెలియజేశారు. తమకి ఉపాధి కల్పించాలి అన్న తమ బిడ్డలకి మంచి భవిష్యత్తు రావాలన్నా మాధవి గారు గెలిస్తేనే సాధ్యమని తెలియజేశారు. లోకం మాధవి గారు మాట్లాడుతూ భూ నిర్వాసితుల పట్ల తన వైఖరి ఎప్పుడూ ఒకేలా ఉందని, వాళ్లకి ఉపాధి దొరికే లాగా తాను తరువా తీసుకుంటానని లోకం మాధవి తెలియజేశారు.