రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణపాయ స్థితిలో నర్సంపేట నియోజకవర్గ జనసైనికుడు వినయ్

వరంగల్, నర్సంపేట, రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణపాయ స్థితిలో నర్సంపేట నియోజకవర్గ జనసైనికుడు వినయ్. విషయం తెలుసుకొని వెంటనే స్పందించి ఫోన్ ద్వారా వినయ్ ఆరోగ్య పరిస్థితి వివరాలు తెలుసుకొని విచారం వ్యక్తం చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ ఆకుల సుమన్. వరంగల్ గార్డియన్ హాస్పిటల్లో వినయ్ ని పరామర్శించిన నియోజకవర్గ నాయకుడు మేరుగు శివ కోటీ యాదవ్, మెరుగైన వైద్యం అందించాలని తెలిసిన ఆసుపత్రి వైద్యులకి విజ్ఞప్తి చేసిన జిల్లా నాయకులు గోళ్ల రాజేంద్ర ప్రసాద్. వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ ఖానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలయ్యి వరంగల్ గార్డియన్ హాస్పిటల్ చికిత్స పొందుతున్న నర్సంపేట పట్టణానికి చెందిన పవన్ కళ్యాణ్ అభిమాని మరియు జనసేన పార్టీ కార్యకర్త గొట్టిముక్కుల వినయ్ ని జనసేన పార్టీ నర్సంపేట నియోజకవర్గ నాయకుడు మేరుగు శివ కోటీ యాదవ్ వెళ్లి పరామర్శించి, ఆసుపత్రి డాక్టర్ ఫ్. కాళీ ప్రసాద్ రావుని కలిసి వినయ్ ఆరోగ్య పరిస్థితి వివరాలు తెలుసుకొని కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పడం జరిగింది. అలాగే ఈ సంఘటనకి సంబంధించి విషయం తెలుసుకున్న ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జీ శ్రీ ఆకుల సుమన్ వెంటనే స్పందించి ఫోన్ ద్వారా వినయ్ ఆరోగ్య పరిస్థితి వివరాలు తెలుసుకొని జనసేన కార్యకర్త వినయ్ రోడ్డు ప్రమాదానికి గురవడం, ఈ సంఘటనలో అతని స్నేహితుడు సధాశివుడు మరణించడం చాలా బాధకరం అన్నారు. వినయ్ ని పరామర్శించిన వారిలో జనసేన విద్యార్ది విభాగం నాయకులు ఎలబోయిన డేవిడ్ రాజ్, జనసైనికులు అనుదీప్, వంగ మధు తదితరులు ఉన్నారు.