ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించిన వినుత కోటా

శ్రీకాళహస్తి నియోజకవర్గం లో అప్పుల భాదతో రైతు ఆత్మహత్య

శ్రీకాళహస్తి నియోజకవర్గం, శ్రీకాళహస్తి మండలం, వాగవేడు హరిజనవాడ కి చెందిన 32 సం.ల వయసు గల రైతు మటం జనార్ధన్ అప్పుల భాదతో ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. మృతుడి భౌతిక కాయానికి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా.. 2 ఎకరాలు సొంత భూమి 2 ఎకరాలు కౌలుకు చేసుకునేవాడని, ఇటీవల కౌలుకు 2 ఎకరాల్లో శనగ పంట వేసి నష్టం రావడంతో కౌలు ఇవ్వలేక, అప్పులు కట్టలేక ప్రతి సంవత్సరం అప్పులతో పాటు దాదాపు 6 నుండి 7 లక్షలు అప్పులు తీర్చలేక చనిపోయాడని కుటుంబ సభ్యులు గ్రామస్థులు వినుత కు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు కుటుంభానికి అండగా ఉంటారని, పార్టీ నుండి కుటుంబాన్ని తప్పకుండా ఆదుకుంటామని బరోసా ఇవ్వడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *