శ్రీమతి పాలవలస యశస్వి ఆధ్వర్యంలో జగనన్న కాలనీల సందర్శన

విజయనగరం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీ ఇళ్ళ స్థలాలను సందర్శించే కార్యక్రమంలో భాగంగా పేదలకు ఇళ్ళు నిర్మించి ఇవ్వడంలో దేశంలో అట్టడుగున ఆంధ్రప్రదేశ్ ఉందని, వైసిపి ప్రభుత్వం చేపట్టిన టిడ్కో ఇళ్ళ నిర్మాణం డొల్లతనాన్ని ప్రజల ముందుకు తీసుకొని రావడానికి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ చేపట్టిన డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా శనివారం విజయనగరంలోని గుంకలాం నందు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు విజయనగరం అసెంబ్లీ ఇంచార్జి శ్రీమతి పాలవలస యశస్వి ఆధ్వర్యంలో ఆ పార్టీ వీరమహిళలు, నాయకులు మరియు జనసైనికులు తరలిరాగా టిడ్కో ఇళ్ళ నిర్మాణంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ డిజిటల్ క్యాంపైన్ నిర్వహించడం జరిగింది.