బిక్కవోలులో జగనన్న ఇళ్ళ సందర్శన

తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నియోజకవర్గం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీ ఇళ్ళ స్థలాలను సందర్శించే కార్యక్రమంలో భాగంగా అనపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు బిక్కవోలు మండలం, బిక్కవోలు, ఆరికరేవుల గ్రామాలలో జగనన్న కాలనీలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కేటాయించిన కాలనీలు వర్షాలు వస్తే ముంపుకు గురవుతున్నాయని, కనీస సౌకర్యాలు కూడా లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలియజేయడం జరిగింది. నియోజకవర్గ సమన్వయకర్త రావాడ నాగు, బిక్కవోలు మండల అధ్యక్షుడు ఇందల వీరబాబు, ఉపాధ్యక్షులు తేతల వెంకటరెడ్డి, కోరాడ రామారావు, జిల్లా ప్రోగ్రాం కమిటీ అడబాల విష్ణు, మండల కమిటీ సభ్యులు నూతంగి ప్రసాద్ చంద్రరావు, బాలు, బ్రహ్మన్న, మేల్లూరు గ్రామ శాఖ అధ్యక్షులు నరసింహారాజు, జనసేన నాయకులు సుంకర బుజ్జి, నాగ, సూరన్న, పెద్దద అశోక్, కొలుసు సింహాచలం, వెంకటేష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.