వాలంటీర్లు.. జగన్ రెడ్డికి మీ పట్ల ఏ మాత్రం చిత్తశుద్ది లేదు

  • వాలంటీర్లు వాస్తవాలు తెలుసుకోవాలి

కదిరి: వారాహియాత్ర విజయవంతం అవ్వడంతో ఏమి చెయ్యాలో పాలుపోని వైస్సార్సీపీ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా అడ్డుకోవాలని చూస్తున్నారని కదిరి జనసేన నాయకులు పేర్కొన్నారు. బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తూ “కొద్ది మంది” వైఎస్సార్సీపీ పార్టీ నాయకులకు అందిస్తున్నారు వాళ్ళు దోపిడీలకు, దారుణాలకు, అఘాయిత్యాలకు, సంఘ విద్రోహక చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. కానీ వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు వాలంటీర్లను రెచ్చగొడుతూ ఆయన మాటలను వక్రీకరిస్తూ పవన్ కళ్యాణ్ గారిపై దూషణలు చేస్తున్నారు. కొంచెమైనా ఆలోచన చెయ్యండి వాలెంటిర్లను ఈ జగన్ మోహన్ రెడ్డి కేవలం తమ రాజకీయ స్వప్రయోజనాల కోసమే వాడుకుంటున్నారు తప్ప నాలుగు సంవత్సరాల నుంచీ మీకు ఇచ్చే 5000 వేతనం సరిపోలేదు అంటుంటుంటే మీ సమస్యల పట్ల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండరు పేరుతో లక్షల్లో ఉద్యోగాలు కల్పించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పిన ఈ జగన్ రెడ్డి ఎందుకు ఆ దిశగా అడుగులు వెయ్యలేదని అద్భుతాలు చెయ్యగల యువతను కేవలం చాలీ చాలని జీతంతో గడిపే విధంగా చేస్తున్నాడు మీ పట్ల ఆయనకు ఏ మాత్రం చిత్తశుద్ది లేదు. వాస్తవాలు తీసుకోవాలని రాష్ట్ర వాలెంటిర్లకు హితబోధ చేస్తున్నాము అనవసరంగా మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కదిరి జనసేన పార్టీ తరపున వాలెంటర్లను వెనకనుంచీ మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న వైఎస్సార్సీపీ పార్టీ నాయకులను కదిరి జనసేన పార్టీ తరపున, జనసైనికుల తరపున హెచ్చరిస్తున్నాము.మీకు వాలేంటిర్ వ్యవస్థపై అంత ప్రేమే ఉంటే మీరు చెప్పినట్లు వారికి 8500₹ నెల నెల జీతం అందించే విధంగా ప్రయత్నం చెయ్యండి అలాకాదని కేవలం మా పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే విమర్శిస్తాము అంటే చూస్తూ ఊరుకోం అని కదిరి జనసేన పార్టీ తరపున తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఐటి వింగ్ కోఆర్డినేటర్ రాజేంద్ర ప్రసాద్, గోపీనాథ్, రాజ శేఖర్, శ్రీనివాసులు, వెంకటేష్, కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు.