పవన్ కళ్యాణ్ కు వాలంటీర్లు క్షమాపణ చెప్పాలి

  • మీరు పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలి
  • నిజాలు మాట్లాడితే కేసులు పెడతారా
  • రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి
  • అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు

అరకు నియోజకవర్గం: పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు వాస్తవం, ఆయన అన్నీ నిజాలే మాట్లాడారు. పవన్ కళ్యాణ్ క్షమాపణ ఎవరికీ చెప్పవలసిన పనిలేదని అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు పేర్కొన్నారు. అరకువాలీ మండలంలో గురువారం మదల శ్రీరాములు విలేకరులతో మాట్లాడుతూ.. గత రెండు, ముడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తముగా జనసేన పార్టీ అధినేతపై రాష్ట్ర వ్యాప్తముగా వాలంటీర్లు కేసులు పెట్టడం, అసభ్యకరంగా విమర్శించడం జరుగుతున్నది. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు వాస్తవం. ఆయన్ అన్నీ నిజాలే మాట్లాడారు. ఎవరికీ పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పవలసిన పనిలేదు. రాష్ట్రంలో జరిగేదే చెప్పారు. జరగబోయేది చెప్పారు మీరందరు అర్ధం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు వాలంటీర్లు సరిగ్గా విని రోడ్డు మీదకు రండి. పవన్ కళ్యాణ్ కేసులు పై పెట్టే హక్కు మీకు లేదు. వాలంటీర్లు వెంటనే పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి. లేకపోతే వాలంటీర్ వ్యవస్థకే చెడ్డపేరు, వైసిపి నాయకు రెచ్చగొడితే అనవసరంగా రెచ్చి పోకండి, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వెంటనే పవన్ కళ్యాణ్ గారికి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలని మాదాల శ్రీరాములు డిమాండ్ చేసారు.