యువతా మేలుకో..! “యువశక్తి”కి చేరుకో.

పెడన, జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న యువశక్తి కార్యక్రమానికి పెద్ద ఎత్తున యువతీ యువకులు హాజరుకావాలని, ఈ నెల జనవరి 12వ తేదీన ఉత్తరాంధ్ర వేదికగా శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి కార్యక్రమం ద్వారా యువతి యువకులు తమ గొంతు ద్వారా ఉత్తరాంధ్ర సమస్యలను తెలియజేయలని ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్వామి వివేకానంద చెప్పినట్లు “యువత మేలుకో, లేలెమ్ము, అలసత్వం వద్దు గమ్యం చేరే దాకా నీ పరుగును ప్రయత్నాన్ని ఆపకు” ఆనాడు స్వామి వివేకానంద యువతను మేల్కొల్పి స్వాతంత్ర్య పోరాటానికి సమానత్వం చేశారు. నేడు పవన్ కళ్యాణ్ యువశక్తి ద్వారా యువతను జాగృతి చేస్తూ దోపిడీ, దౌర్జన్యాలతో అరాచక శక్తులు రాజ్యమేలుతున్న వేళ సమాజ శ్రేయస్సుకై యువత నడుము కట్టి అవినీతితో కరుడుగట్టిన అరాచక శక్తులను అంతమొందించి, నీతి నిజాయితీతో కూడిన సుపరిపాలన అందించే నాయకుడికి మద్దతుగా నిలుద్దామని పెడన జనసేన నాయకులు ఎస్.వి.బాబు పిలుపునిచ్చారు.