మేడారం జాతరలో భక్తులకు దాహాన్ని తీర్చిన వరంగల్ జనసేన

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా తరలివస్తున్న భక్తులకు కాజీపేట రైల్వే స్టేడియం ఆర్టీసీ బస్ స్టాండ్ లో వరంగల్ జనసేన పార్టీ అధ్వర్యంలో మంచి నీటి బాటిళ్లు అందజేసి దాహాన్ని తీర్చటం జరిగింది. ఈ సందర్బంగా జనసేన నాయకులు గోళ్ళ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతు కరోనా దృష్ట్యా ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని, జాతర జరిగే 4 రోజులు భక్తులకు మాస్కులు వాటర్ బాటిల్లు పంపిణీ చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గడ్డం రాకేష్, గాదె పృథ్వి, మేకల ప్రసన్న కుమార్, ముక్క అభిలాష్, కొల్లూరి అనుదీప్, శివాజీ, పసుల మహేష్, వెలిశాల రాజు తదితరులు పాల్గొన్నారు.