వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జిగా బైరి వంశీ కృష్ణ

హనుమకొండ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జిగా బైరి వంశీ కృష్ణ నియామకం అయ్యారు. ఈ మేరకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో అధికారికంగా ప్రకటించి నియామక పత్రాన్ని బైరి వంశీ కృష్ణ కి అందజేశారు. ఈ సందర్బంగా బైరి వంశీ కృష్ణ మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో కృషిచేస్తానని రాబోయే ఎన్నికలో జనసేన జెండా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఎగరవేస్తామని తెలిపారు. తనపై నమ్మకంతో ఈ పదవి అప్పగించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలియజేసారు.