కాకినాడ సిటిలో మేము సిద్ధం

కాకినాడ సిటిలో జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు కాకినాడ్ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో 27వ డివిజన్ దూదిమిల్లు ప్రాంతంలో వాసంసెట్టి శ్రీను ఆధ్వర్యంలో గ్రీన్ టాక్స్ పేరుతో దారుణ దోపిడీ చేస్తున్న వై.సి.పి ప్రభుత్వాన్ని తరిమి వెయ్యడానికి మేము సిద్ధం అని అంటూ మేము సిద్ధం అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర సమ్యుక్త కార్యదర్శి వాశిరెడ్డి శివ మాట్లాడుతూ సిద్ధం అనే పేరుతో అధికార దుర్వినియోగం చేసి సభలను నిర్వహించడం తప్ప మరేమీ జగన్మోహన్ రెడ్డి సభలలో ప్రత్యేకత కనపడటంలేదన్నారు. తాను లేకపోతే నేడు ఇస్తున్న ప్రభుత్వ పధక ప్రయోజనాలు ఆగిపోతాయనీ అందుకే తనని నెగ్గించాలని ప్రజలను బతిమిలాడుతున్న ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం చందాన ఒకపక్క నుండి భారీగా పన్నులు వేసి పేద ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పిచేస్తూ వాటిలో కొంత భాగాన్ని నగదు ఇస్తున్నట్టు బటన్ నొక్కడం మీద స్వేతపత్రాన్ని ఎందుకు విడుదల చేయడంలేదని ప్రశ్నించారు. గ్రీన్ టాక్స్ పేరుతో భారీగా దోపిడీ చేస్తూ లారీలు, ఆటోలపై పిండేస్తూ ఆ రంగాన్ని చంపేయడం నిజం కాదా అని ప్రశ్నిస్తూ, అందుకే నేడు ఈముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వైసిపి ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి మేము సిద్ధం అని ప్రజలు అంటున్నారని త్వరలో జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ప్రజాసంక్షేమ ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి శివ, జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ, సాధనాల లోవరాజు, వెంకటరమణ, పంతాడి రాంకుమార్, కిషోర్, జానీ, రామారావు, జీవంకుమార్, ఆనంద్ కుమార్, కామిరెడ్డి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.