జనసైనికులకు భరోసాగా మేముంటాం: మడకశిర జనసేన

మడకశిర నియోజకవర్గం, రోళ్ల మండలం, రత్నగిరి పంచాయతీలో రవి అనే జనసైనికుడు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ.. కర్ణాటకలోని తుముకూరు జిల్లా ఆస్పత్రిలో మరణించాడు. చాలా బాధాకరమైన విషయం ఆ కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. వారి కుటుంబానికి అండగా మేమున్నామంటూ మడకశిర నియోజకవర్గం జనసైనికులు ముందుకు వచ్చి ఆ కుటుంబానికి 10,000 ఆర్థిక సాయం చేయడం జరిగింది. నియోజకవర్గాల్లో ఎక్కడైనా జన సైనికులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా భరోసాగా మేముంటాం అని మడకశిర నియోజకవర్గ జనసైనికులు తెలియజేస్తూ.. పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి అని వారు కోరారు.