రెడ్డి అప్పల నాయుడు సమక్షంలో జనసేనలో చేరికలు

ఏలూరు నియోజకవర్గం 1 వ డివిజన్ నాగేశ్వరపురం ఏరియాల నుండి టిడిపి, వైసీపీ, ఇతర పార్టీల నుండి సుమారు 50 మంది కార్యకర్తలు జనసేన పార్టీలో చేరడం జరిగింది. వారికి జనసేన పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారి రైతు భరోసా యాత్రకు కానీ, ఇతర నిర్మాణ రంగంలో కానీ ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నట్లు వంటి తప్పులను ఎత్తి చూపిస్తూ పరిష్కారం వైపుగా వారు చేస్తున్న కృషిలో వారి యొక్క పోరాటంలో వారితో పాటు అడుగులో అడుగులు వేద్దామని వీరంతా చేరడం జరిగిందని అన్నారు. ఈయొక్క సమాజ మార్పులో భాగంగా సమసమాజ నిర్మాణం కోసం యువతగా ఇది మా బాధ్యత మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలి. ప్రజలందరికీ సంక్షేమం అందాలి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అనే మంచి ఆలోచనతో పార్టీలోకి చేరారు. వీరందరికీ ఏలూరు జనసేన పార్టీ కన్వీనర్ గా స్వాగతం పలుకుతున్నాను. అలాగే నియోజకవర్గంలో ఉన్న అనేక మంది మంచి సమాజాన్ని కోరుకొని రేపటి తరానికి వచ్చే జనరేషన్ కీ మంచి కల్చర్ నీ, మంచి వేదికనీ, మంచి పరిపాలన అందించాలనే ఆలోచనను అందిపుచ్చుకుని జనసేనపార్టీలోకి చేరి ఒక మంచి నాయకత్వాన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని తద్వారా ఈరాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి మంచి పరిపాలన అందించాలని వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వీరందరికీ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుంది. ఎల్లప్పుడూ వారికి ఏ రకములైన సమస్యలు ఉన్నా వారి ద్వారా ప్రజల యొక్క సమస్యలు ఏమొచ్చిన జనసేన పార్టీ పూర్తి స్థాయిలో సహకారంగా అండగా నిలబడుతుందని ప్రజా పరిష్కారంలో ఎప్పుడూ కూడా ముందు భాగంలో ఉంటుందని ఆయన తెలిపారు.