అంగన్వాడి వర్కర్స్ కి అండగా ఉంటాం: చిట్వేలి మండల జనసేన

రైల్వే కోడూరు: రాష్ట్ర వ్యాప్తంగా గత తొమ్మిది రోజులుగా అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ వారు చేపడుతున్న రిలే నిరసన దీక్షకు మద్దతుగా బుధవారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ చిట్వేలి మండల నాయకులు మాదాసు నరసింహ అధ్వర్యంలో అంగన్వాడి అక్క చెల్లెళ్లకు వారు చేపడుతున్న నిరసనలో పాల్గొని తమ మద్దతు తెలియచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్స్ తాలూకా న్యాయమైన కోర్కెలకు తమ మద్దతు తెలిపి వెంటనే వారికి రావాల్సిన బకాయులను తీర్చాలని, ప్రస్తుత ముఖ్యమంత్రి గతంలో తాను ప్రతిపక్ష నేతగా ఉండగా ఇచ్చిన హామీలను వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్లు ఏదైతే గౌరవ వేతనంగా 26 వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ఆ యొక్క హామీని నెరవేర్చాలని గతంలో కూడా తెలంగాణ కంటే ఎక్కువ వేతనం మీకు పెంచుతామని చెప్పి మీరు పాదయాత్రలో ఇచ్చిన హామీలను విస్మరించి మాట తిప్పారని నిలదీశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాదాసు నరసింహ, షేక్ రియాజ్ కంచర్ల సుధీర్ రెడ్డి, పగడాల శివమాదాసు శివ, సుభాష్ చంద్రబోస్, పసల శివ పురం గోపాల్, ఆనందల తేజ, కడుమురి సుబ్రమణ్యం, నీలి కృష్ణ, దండుదినేష్, హేమంత్ రెడ్డి, మౌలానా తదితరుల పాల్గోన్నారు.