జనసైనికుడి కుటుంబానికి అండగా ఉంటాం: హరీష్ గౌడ్

రామగుండం నియోజకవర్గం: జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త మృణల్ ఇల్లు కూలిపోయింది. ఆరు నెలల నుండి నివసించడానికి సరైన ఇల్లు లేక చాలా దారుణమైన పరిస్థితిలో మృణల్ కుటుంబం ఉన్నది. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ ఇంచార్జ్ మూల హరీష్ గౌడ్ శుక్రవారం వారి ఇంటికి వెళ్లి, వారిని పరామర్శించి తప్పకుండా వారికి కొత్త ఇల్లు నిర్మిస్తామని జనసేన తరఫున వారికి హామీ ఇచ్చి, వారికి కచ్చితంగా ఇల్లు నిర్మిస్తామని జనసేన పార్టీ ఎప్పుడూ వారికి అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మాజీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు రావుల మధు, రామగుండం మండల ప్రధాన కార్యదర్శి వేమూర్ల రంజిత్ రవికాంత్, లోకేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.