జనసైనికుడు సతీష్ కుటుంబానికి అండగా జనసేన

రామగుండం నియోజకవర్గం: జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కలిగివున్న సీనియర్ కార్యకర్త సతీష్ గత కొన్ని రోజులుగా క్యాన్సర్ తో బాధపడుతూ గురువారం మరణించడం జరిగింది. రామగుండం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మూల హరీష్ గౌడ్ మరియు జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు రావుల మధు సతీష్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి జనసేన అండగా ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకొని వారితో ఫోన్లో మాట్లాడి వారికి అండగా నేను ఉన్నాను జనసేన పార్టీ తోడుగా ఉంటుంది మేమంతా ఉన్నామని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ వారికి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామగుండం మండల ప్రధాన కార్యదర్శి వేమూర్ల రంజిత్, నాయకులు రవి కాంత్, ప్రసాద్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు.