మాబుల్లా కుటుంబానికి అండగా ఉంటాం.. దుగ్గిశెట్టి సుజయ్బాబు
నెల్లూరు: రంజాన్ పండుగ రోజు హత్యకు గురికాబడిన మాబుల్లా కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం వెంకటేశ్వరపురంలోని రైలుకట్ట వీధిలోని మాబుల్లా కుటుంబాన్ని ఆయన జనసైనికులతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా సుజయ్బాబు మాట్లాడుతూ.. మాబుల్లా హత్య జరిగి రెండు నెలలు గడిచిందని, ఇప్పటి వరకు ఆ కుటుంబాన్ని ఎవరూ ఆదుకోకపోవడం దురదృష్టకరమన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి బాధిత కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చూస్తామన్నారు. ఈ కేసుకు సంబంధించి కూడా జిల్లా త్వరలోనే జిల్లా ఎస్పీని కలుస్తామని సుజయ్బాబు తెలిపారు. ఆయన వెంట జనసైనికులు ఉన్నారు.