ప్రజాసమస్యల పరిష్కారమే ద్యేయంగా ముందుకు వెళతాం: బైరపోగు సాంబ శివుడు

కొల్లాపూర్ నియోజకవర్గం, పెంట్లవెల్లి మండలంలో బుధవారం జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి కొల్లాపూర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ బైరపోగు సాంబ శివుడు హాజరై మండల పరిధిలోని వేంకటేశ్వర స్వామినీ దర్శించుకొని అనంతరం కార్యకర్తలకు జనసేన పార్టీ బలోపేతం పట్ల దిశ నిర్దేశం చేశారు.. పెంటవెల్లి మండలంలో ప్రజల సమస్యలను పరిష్కరించే దిసగా జనసేన పార్టీ కార్యకర్తలను పనిచేసి కాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు పనిచేసి పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా, ప్రజలకు పార్టీ సిద్ధాంతాలను తెలియజేయాలని, కార్యకర్తలు పార్టీ యొక్క ఉద్దేశాన్ని, పార్టీ ఆవిర్భవించినప్పటినుంచి పార్టీ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్ళే రీతిలో అనేక సందర్భాల్లో పెంట్లవెల్లి మండల కేంద్రంలో కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు ప్రజల సమస్యలను పక్కనపెట్టి రాజకీయ ఎత్తుగడ్డలతో, కేవలం రాజకీయ లబ్ధి కోసం పనిచేస్తూ ముందుకు వెళ్తున్న రాజకీయ వ్యవస్థను, రాజకీయ పార్టీలను ప్రజల నుంచి దూరం చేసే విధంగా ప్రజలకు దగ్గరై ప్రజా పాలన, ప్రజలు కోరుకునే విధంగా ఉండే పార్టీ జనసేన అని పార్టీని ప్రజలలోనికి తీసుకెళ్ళాలని జనసేన పార్టీ కార్యకర్తలతో పెంట్లవెల్లి మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి ఈ విధంగా అన్నారు. ఈ కార్యక్రమంలో రవితేజ, నాగరాజు, ఎజ్జు ఆంజనేయులు రెడ్డిరవి, రెడ్డి రమేష్ భూపతి శివ పాల్గొన్నారు.