జనసేన సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం: డా. మాధవరెడ్డి

తెలంగాణ, శేరిలింగంపల్లి నియోజకవర్గం: జనసేన శేరిలింగంపల్లి ఇంచార్జ్ డా. మాధవరెడ్డి బుధవారం మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది.
ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో జనసేన 32 స్థానాల్లో పోటీ చేయనున్న విషయం మీడియా మిత్రులతో పంచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ జనసేన పోటీకి సిద్ధమని ప్రకటించిన 32 స్థానాల్లో శేరిలింగంపల్లి కూడా ఉండడం ఆనందకరం అని వ్యాఖ్యానించారు. ఇక ముందు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, జనసేన సిద్ధాంతాలను మరింత బలంగా ప్రజలముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. ఈ సందర్బంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని సమస్యలు, ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని జనసేన పార్టీ రూపొందించిన మేనిఫెస్టోని మీడియా మిత్రుల ముందు ఉంచారు. మేనిఫెస్టోకి సంబంధించి పలు ప్రశ్నలకు మాధవ రెడ్డి సహా జనసేన నాయకులు సమాధానాలు చెప్పారు.